రైతు సంక్షేమమే ధ్యేయం

ABN , First Publish Date - 2020-10-27T09:06:04+05:30 IST

రైతు సంక్షే మమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ తెలిపారు. మెరక ముడిదాం పీఏసీఎస్‌లో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎంపీ బెల్లాన, వైసీపీ జిల్లా నాయకుడు మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు.

రైతు సంక్షేమమే  ధ్యేయం

మెరకముడిదాం:  రైతు సంక్షే మమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ తెలిపారు.  మెరక ముడిదాం పీఏసీఎస్‌లో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎంపీ బెల్లాన, వైసీపీ జిల్లా నాయకుడు మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీఎంస్‌ చైర్మన్‌   రమణరాజు, విశ్వేశ్వరరావు, వేణుగోపాలరావు, మోతీలాల్‌నాయుడు, ప్రసాద్‌,   నరేష్‌కుమార్‌, ఏడీ ఎన్‌వీ వేణుగోపాల్‌, ఏవో జి.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


 బొబ్బిలి: స్థానిక ఏఎంసీ, పీఏసీఎస్‌లో మొక్కజొన్న కేంద్రాలను ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బొబ్బిలిలో రెండు, తెర్లాం మండలంలో9, రామభద్రపురం మండలంలో 2 చొప్పున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది క్వింటాకు రూ. 1850 పెంచినట్లు చెప్పారు. మాజీ ఏఎంసీ చైర్మన్‌ ఇ.గోపాలరావు, తహసీల్దార్‌ ప్రసాద్‌ పాత్రో, ఏవో శ్యామసుందర్‌, ఏఎంసీ కార్యదర్శి వాసుదేవరావు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు కృష్ణమూర్తి, వైసీపీ నేతలు భాస్కరరావు, కృష్ణమూర్తి, సత్యనారా యణ, సాయి, గోవిందరావు, గోపి, ఉమాశంకర్‌, బాబు, ఎస్‌డీవో రామకృష్ణ  పాల్గొన్నారు.

Updated Date - 2020-10-27T09:06:04+05:30 IST