యువకుడి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2020-10-29T08:15:53+05:30 IST

అనుమానాస్పద స్థితిలో నేలబావిలో పడి కిల్లాడ చిన్నారావు (30) అనే యువకుడు మృతిచెందాడు. ఇందుకు సంబంధించి భూర్జివలస ఎస్‌ఐ బి.భాగ్యం అందించిన వివరాలిలా ఉన్నాయి.

యువకుడి అనుమానాస్పద మృతి

 నేలబావిలో మృతదేహం  ఫ దర్యాప్తు చేస్తున్న పోలీసులు


దత్తిరాజేరు అక్టోబరు 18: అనుమానాస్పద స్థితిలో నేలబావిలో పడి కిల్లాడ చిన్నారావు (30) అనే యువకుడు మృతిచెందాడు. ఇందుకు సంబంధించి భూర్జివలస ఎస్‌ఐ బి.భాగ్యం అందించిన వివరాలిలా ఉన్నాయి. పి.లింగాలవలస గ్రామానికి చెందిన చిన్నారావు సోమవారం షికారుగంజిలో పని ఉందంటూ చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. సాయంత్రానికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం షికారుగంజి సమీపంలోని పొలంలో ఉన్న నేలబావిలో మృతదేహం తేలి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పి.లింగాలవలస వ్యక్తిగా గుర్తించారు. మృతుడి భార్య పెంటమ్మ వచ్చి చిన్నారావు మృతదేహంగా గుర్తించింది. మృతుడికి నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు.


శవపంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తూ మృతిచెందాడా? లేకుంటే ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉందని ఎస్‌ఐ భాగ్యం తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి విచారణ చేపడుతున్నట్టు చెప్పారు.  

Updated Date - 2020-10-29T08:15:53+05:30 IST