ఏనుగు దాడి బాధితునికి మెరుగైన వైద్యం
ABN , First Publish Date - 2020-10-29T08:18:04+05:30 IST
ఏనుగు దాడి లో గాయపడిన ఎర్ర నారా యణరావుకు మెరుగైన వై ద్యం అందించేందుకు అటవీ శాఖ అన్ని చర్యలు తీసుకుం టుందని కొమరాడ అటవీ సె క్షన్ అధికారి శ్రీనివాసరావు చె ప్పారు.
కొమరాడ : ఏనుగు దాడి లో గాయపడిన ఎర్ర నారా యణరావుకు మెరుగైన వై ద్యం అందించేందుకు అటవీ శాఖ అన్ని చర్యలు తీసుకుం టుందని కొమరాడ అటవీ సె క్షన్ అధికారి శ్రీనివాసరావు చె ప్పారు. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితు డిని అటవీసంరక్షణ (విశాఖ) అధికారి పి.రామ్మోహనరావు, జిల్లా అటవీశాఖ అధికారి సచిన్ గుప్తా వెళ్లి పరామర్శించారని తెలిపారు. బాధితుని ఆరోగ్య పరిస్థితిపై వైద్యు లను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. బాధితుని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదు కుంటామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.