ఎమెల్యే దృష్టికి సమస్యలు

ABN , First Publish Date - 2020-10-30T11:54:57+05:30 IST

మండలంలోని సమస్యలను స్థానిక నాయకులు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు దృష్టికి తీసుకొచ్చారు.

ఎమెల్యే దృష్టికి సమస్యలు

పూసపాటిరేగ: మండలంలోని సమస్యలను స్థానిక నాయకులు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం లో అధికారులు, నాయకులతో ఆయన గురువారం సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఇందులో భాగంగా నాయకులు మాట్లాడుతూ మండలంలోని అభివృ ద్ధి పనులు ఇసుక కొరత కారణంగా ఆలస్యం అవుతున్నాయని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామీణ బ్యాంకుల నిర్లక్ష్యం కారణంగా ఆసరా చెల్లింపుల్లో జాప్యం ఏర్పడుతోందన్నారు. నాడు-నేడు పనులను వెల్ఫేర్‌ అసిస్టెం ట్లతో పర్యవేక్షించాలని, అప్పుడే అధికారులు ఇచ్చిన నివేదికలపై స్పష్టత వస్తుం దని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వరరావు, ఇన్‌చార్జి తహసీల్దార్‌ విజయ్‌భాస్కర్‌, వివిధ శాఖల అధికారులు, వైసీపీ మండల అధ్యక్షు డు పతివాడ అప్పలనాయుడు, మండల నాయకులు మహంతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-30T11:54:57+05:30 IST