వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ అత్యుత్సాహం

ABN , First Publish Date - 2022-05-25T02:54:48+05:30 IST

వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ అహ్మద్‌బాషా అత్యుత్సాహం ప్రదర్శించి, తాము ఉండే ఇంట్లోకి సుమారు 15 మంది దర్గా సిబ్బందితో అక్రమంగా

వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ అత్యుత్సాహం
పోలీస్‌స్టేషన్‌ వద్ద రిజిస్టర్‌ పత్రాలు చూపుతున్న బాఽధితులు

 దర్గా సిబ్బందితో కలిసి దౌర్జన్యం

 న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు

ఏఎస్‌పేట, మే 24: వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ అహ్మద్‌బాషా అత్యుత్సాహం ప్రదర్శించి, తాము ఉండే ఇంట్లోకి సుమారు 15 మంది దర్గా సిబ్బందితో అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యం చేశారని ముస్లిం మహిళలు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన సయ్యద్‌ అబీదా, దర్గా ముత్తవల్లి అఫీజ్‌పాషాకు మధ్య విబేధాలు ఉన్నాయి. ఈ క్రమంలో అబీదా వంశపారపర్యంగా ఉంటున్న తన సొంత ఇల్లు మరమ్మతులకు గురికావడంతో దాన్ని రిపేరు చేసుకుంటోంది. అది దర్గాకు చెందిన ఆస్తి అని, అన్యాయంగా అక్రమించుకున్నారని వారిపై తరుచూ వేధింపులకు గురి చేసేవాడు. ఇటీవల మరమ్మతులు నిలిపివేయాలని ఆదేశాలు చేశాడు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నంలో వక్ప్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ అహ్మద్‌బాషా, దర్గా ఉద్యోగులు రఫీ, ఖలీల్‌, ఖాజా, మరో 15 మంది దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి తమను నెట్టివేయడంతోపాటు గందరగోళాన్ని సృష్టించారని బాధితులు వాపోయారు.  దీంతో వెంటనే ఇంట్లోవారు, చుట్టుపక్కలవారు రావడంతో వారు వెనుతిరిగారని పేర్కొన్నారు. ఈ విషయమై ఎస్‌ఐ సుభానీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. తరుచూ తనను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  బాధితులు కోరారు. తమవద్ద పంచాయతీ పన్నులు, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్స్‌ అన్ని ఆధారాలున్నా కక్షపూరితంగా వేధిస్తున్నారని వారు ఆరోపించారు.


Updated Date - 2022-05-25T02:54:48+05:30 IST