పాత పీఆర్సీ ప్రకారమే వేతనాలు చెల్లించాలి

ABN , First Publish Date - 2022-01-29T05:59:43+05:30 IST

పాత పీఆర్సీ ప్రకారమే జనవరి నెల వేతనాలు చెల్లించాలని పీఆర్‌సీ సాధన సమితి నాయకులు పేర్కొన్నారు.

పాత పీఆర్సీ ప్రకారమే వేతనాలు చెల్లించాలి
ధర్మవరంలో వినతిపత్రం అందజేస్తున్న ఉద్యోగులు

ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన

ధర్మవరం, జనవరి 28: పాత పీఆర్సీ ప్రకారమే జనవరి నెల వేతనాలు చెల్లించాలని పీఆర్‌సీ సాధన సమితి నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జునకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగుల పీఆర్సీ జీఓ లను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్ర మంలో నాయకులు మల్లికార్జునరెడ్డి, ఉరుకుందప్ప, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు శెట్టిపి జయచంద్రారెడ్డి, ఏపీటీఎఫ్‌ జిల్లా నాయకులు రవీంద్రారెడ్డి, యూటీఎఫ్‌ పట్టణ అధ్యక్షుడు రామకృష్ణనాయక్‌,  రాంప్ర సాద్‌, మున్సిపల్‌ మేనేజర్‌ ఆనంద్‌, రఫిక్‌ అహమ్మద్‌, లక్ష్మయ్య, సాయి గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ముదిగుబ్బ: పాత పీఆర్సీ ప్రకారమే జనవరి నెల వేతనాలు చెల్లిం చాలని ఉద్యోగులు డీడీఓలకు వినతిపత్రం అందజేశారు. మండల కేద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మలకవేముల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న ఉద్యోగులు శుక్రవారం డీడీఓకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కార్యక్రమంలో వైద్యాధి కారులు రాజేంద్ర, రాజేంద్రనాయక్‌, చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీహెచ్‌ఓలు వేణుగోపాల్‌రెడ్డి, సుబ్రమణ్యం, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-29T05:59:43+05:30 IST