‘హమాలీ కార్మికుల వేతనాలు పెంచాలి’
ABN , First Publish Date - 2022-05-24T05:11:46+05:30 IST
సివిల్ సప్లయీస్ హమాలీ కార్మికుల వేతనాలు పెంచా లని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు పేర్కొన్నారు. వేతనాలు పెంచాలని సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
మంచిర్యాల కలెక్టరేట్, మే 23: సివిల్ సప్లయీస్ హమాలీ కార్మికుల వేతనాలు పెంచా లని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు పేర్కొన్నారు. వేతనాలు పెంచాలని సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ హమాలీ కార్మికులకు ఎంఎల్ఎస్ పాయింట్లో పనిచేసే వారికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించలేదని, సొంత గోడౌన్ల నిర్మాణం చేపట్టాలని తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. శంకరయ్య, సత్యనారాయణ, సంపత్, చంద్రయ్య, లచ్చయ్య పాల్గొన్నారు.