ప్రధాని ర్యాలీ జాప్యం..వర్షంతో జనం చెల్లాచెదురు

ABN , First Publish Date - 2022-01-05T21:49:43+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీ బుధవారంనాడు పాల్గొనాల్సిన ఫిరోజ్‌పూర్ ర్యాలీకి వర్షం అవాంతరం..

ప్రధాని ర్యాలీ జాప్యం..వర్షంతో జనం చెల్లాచెదురు

చండీగఢ్: ప్రధాని నరేంద్రమోదీ బుధవారంనాడు పాల్గొనాల్సిన ఫిరోజ్‌పూర్ ర్యాలీకి వర్షం అవాంతరం కలిగించింది. ఆ తర్వాత భద్రతా కారణాల రీత్యా ప్రధాని ర్యాలీ రద్దయింది. ప్రధాని భటిండా నుంచి ఫిరోజ్‌పూర్ బయలుదేరిన సమయలో వర్షం పడటంతో ఆయన రాక కోసం సభాస్థలిలో ఎదురుచూస్తున్న జనం చెల్లాచెదురయ్యారు. కుర్చీలు, బీజేపీ నేతల కటౌట్లు తీసుకుని తలకు అడ్డుపెట్టుకోవడం కనిపించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉంది. ఆ తర్వాత ప్రధాని ర్యాలీ రద్దయినట్టు తెలియడం, వర్షం కూడా పడటంతో జనం సభాస్థలి నుంచి వెనక్కి మళ్లారు.

Updated Date - 2022-01-05T21:49:43+05:30 IST