వలంటీర్‌ అదృశ్యంపై కేసు

ABN , First Publish Date - 2021-03-02T05:58:13+05:30 IST

కోటనందూరు, మార్చి1: కోటనందూరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని రౌతులపూడి మండలం గుమ్మరేగుల గ్రామానికి చెందిన వలంటీర్‌ అదృశ్యం కేసు నమోదై ం

వలంటీర్‌ అదృశ్యంపై కేసు

కోటనందూరు, మార్చి1: కోటనందూరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని రౌతులపూడి మండలం గుమ్మరేగుల గ్రామానికి చెందిన వలంటీర్‌ అదృశ్యం కేసు నమోదై ంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పసగడుగుల శ్రావణి జ్యోతి (20) వల ంటీర్‌గా పనిచేస్తోంది. గతనెల 25న డ్యూటీకి పంచాయతీకి వెళ్తున్నానని ఇంటి దగ్గర చెప్పింది. డ్యూటీకి రాలేదని పంచాయతీ సిబ్బంది జ్యోతి తండ్రి కృష్ణబా బుకు ఫోన్‌చేసి చెప్పారు. దీంతో అప్పటి నుంచి బం ధువులు, ఇతర ప్రాంతాలకు వెళ్లి వెతకగా కనిపించకపోవడంతో సోమవారం కోటనందూరు పోలీస్‌ స్టేషన్లో కృష్ణబాబు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ అశోక్‌  తెలిపారు. 

Updated Date - 2021-03-02T05:58:13+05:30 IST