Telangana: ట్రాక్టర్ బోల్తా... మహిళ మృతి
ABN , First Publish Date - 2021-10-24T14:15:49+05:30 IST
జిల్లాలోని కొత్తకోట మండలం విలియంకొండలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది.
వనపర్తి: జిల్లాలోని కొత్తకోట మండలం విలియంకొండలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ట్రాక్టర్ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. కర్నూలు జిల్లా ఆదోని నుంచి సంగారెడ్డికి పత్తి తీసేందుకు 30 మంది కూలీలు ట్రాక్టర్లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.