సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన.. విపక్ష నేతల హౌస్ అరెస్టు

ABN , First Publish Date - 2021-06-21T19:50:12+05:30 IST

కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా పోలీసులు విపక్ష నాయకులను గృహనిర్బంధం చేశారు.

సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన.. విపక్ష నేతల హౌస్ అరెస్టు

వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా పోలీసులు విపక్ష నాయకులను గృహనిర్బంధం చేశారు. కాంగ్రెస్, బీజేపీ, ఏబీవీపీ నాయకులను హౌస్ అరెస్టు చేశారు. విపక్ష నేతలనే కాకుండా  టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత, తెలంగాణ ఉద్యమకారణి రహిమున్నీషా బేగంను కూడా నిర్బంధించారు. దీనిపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్బంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచే ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి పర్యటించే మార్గంలో పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ నగరానికి వచ్చే ప్రధాన రహదారులన్నీ మూసివేశారు. దీంతో నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-06-21T19:50:12+05:30 IST