Bjp vs Trs: వరంగల్లో ఫ్లెక్సీల రగడ..
ABN , First Publish Date - 2022-08-27T14:25:34+05:30 IST
వరంగల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఫ్లెక్సీల రగడ మళ్లీ మొదలైంది. బండి సంజయ్కు స్వాగతం పలుకుతూ
Warangal: వరంగల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ(bjp vs Trs)ల మధ్య ఫ్లెక్సీల రగడ మళ్లీ మొదలైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(BJP state president Bandi Sanjay)కు స్వాగతం పలుకుతూ బీజేపీ కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు సంఘటనా స్థలంలో ఆందోళన చేస్తున్నారు. ఫ్లెక్సీల చించివేత టీఆర్ఎస్ పనేనంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వరంగల్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర(Praja Sangram Yatra) ముగింపు సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. బీజేపీ బహిరంగ సభ ఉండటంతో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.