వరంగల్ జిల్లాలో ఆంథ్రాక్స్ కలకలం
ABN , First Publish Date - 2021-10-26T16:47:39+05:30 IST
వరంగల్ జిల్లా: దుగ్గొండి మండలం, చాపలబండలో ఆంథ్రాక్స్ కలకలం రేగింది.
వరంగల్ జిల్లా: దుగ్గొండి మండలం, చాపలబండలో ఆంథ్రాక్స్ కలకలం రేగింది. ఆంథ్రాక్స్ వ్యాధి లక్షణాలతో నాలుగు గొర్రెలు మృతి చెందాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన ప్రదేశానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. చనిపోయిన గొర్రెలు సాంబయ్య అనే రైతుకు చెందినవి. కాగా అధికారులు దగ్గరుండి గొర్రెలను ఖననం చేయించారు.