Telangana: కాకతీయ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం
ABN , First Publish Date - 2021-09-17T14:13:30+05:30 IST
జిల్లాలోని కాకతీయ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది.
వరంగల్: జిల్లాలోని కాకతీయ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. ఎంబీబీస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ముగ్గురు థర్డ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. బాధితుడు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థిగా తెలుస్తోంది. జాతీయస్థాయి మెడికల్ సీట్ల కోటాలో బాధితుడికి కేఎంసీలో సీటు లభించింది. కాగా ర్యాగింగ్పై బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు కేఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ర్యాగింగ్కు పాల్పడిన ముగ్గురు సీనియర్లు విద్యార్థికి క్షమాపణ చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ర్యాగింగ్ వివాదం సద్దుమణిగింది.