కట్టుదిట్టమైన భద్రత మధ్య మేడారం హుండీల తరలింపు

ABN , First Publish Date - 2022-02-21T14:28:24+05:30 IST

మేడారం మహా జాతరలో ఏర్పాటు చేసిన 500 హుండీలను పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య హనుమకొండలోని టీటీడీ కళ్యాణమండపానికి తరలించారు.

కట్టుదిట్టమైన భద్రత మధ్య మేడారం హుండీల తరలింపు

వరంగల్: మేడారం మహా జాతరలో ఏర్పాటు చేసిన 500 హుండీలను పోలీసులు  కట్టుదిట్టమైన భద్రత మధ్య హనుమకొండలోని టీటీడీ కళ్యాణమండపానికి తరలించారు. గత జాతరలో రికార్డు స్థాయిలో మేడారం హుండీ ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే. 2020 జాతరలో మొత్తం 502 హుండీలు ఏర్పాటు చేయగా.. రూ.11కోట్ల17లక్షల 99వేల 885 రూపాయల ఆదాయం వచ్చింది. అంతుకు ముందు 2018 జాతరలో రూ.10 కోట్ల 19 లక్షల ఆదాయం లభించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-02-21T14:28:24+05:30 IST