రేపటి నుంచి మేడారం జాతరలో హెలికాఫ్టర్ సేవలు
ABN , First Publish Date - 2022-02-12T16:20:25+05:30 IST
మేడారం మహాజాతర కోసం రేపటి నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
వరంగల్: మేడారం మహాజాతర కోసం రేపటి నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. హనుమకొండ నుంచి మేడారానికి హెలికాప్టర్ను నడుపనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కొక్కరికి వెళ్లి వచ్చేందకు టికెట్ ధర రూ.19,999గా నిర్ణయించింది. మేడారంలో జాయ్ రైడ్ ధర రూ.3700గా నిర్ణయించడం జరిగింది. కర్ణాటకకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ ఈ హెలికాప్టర్లు నడపనుంది. 9400399999, 9880505905 నెంబర్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. ఒక ట్రిప్లో ఆరుగురు వెళ్లేందుకు అవకాశం ఉంది.