Warangal: పోలీసులను వెంటాడుతున్న కరోనా మహమ్మారి
ABN , First Publish Date - 2022-01-14T13:51:33+05:30 IST
జిల్లాలో కరోనా మహమ్మారి పోలీసులను వెంటాడుతోంది.
వరంగల్: జిల్లాలో కరోనా మహమ్మారి పోలీసులను వెంటాడుతోంది. ఐనవోలు మల్లిఖార్జునస్వామి బ్రహ్మోత్సవాలలో విధులు నిర్వహిస్తున్న 11 మంది కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. కమలాపూర్ పోలీస్స్టేషన్లో నలుగురు, ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్లో ఓ కానిస్టేబుల్కు కోవిడ్ పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. అలాగే కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ సీఐకి కరోనా పాజిటివ్ అని వచ్చింది. వరుసగా పోలీసులు కరోనా బారిన పడుతుండటంతో జాతరల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కుటుంబాల్లో భయం భయం నెలకొంది.