Warangal: ఇరు వర్గాల మధ్య వాగ్వాదం... ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-06-21T16:53:15+05:30 IST

జిల్లాలోని హనుమకొండలో గల గుండ్ల సింగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుండ్ల సింగారంలో 3000 మంది పేదలు గుడిసెలు వేసుకున్నారు.

Warangal: ఇరు వర్గాల మధ్య వాగ్వాదం... ఉద్రిక్తత

వరంగల్: జిల్లాలోని హనుమకొండలో గల గుండ్ల సింగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుండ్ల సింగారంలో 3000 మంది పేదలు గుడిసెలు వేసుకున్నారు. అయితే భూమి తమదంటూ అక్కడి స్థానికులు గుడిసెలను తొలగించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు కర్రలతో పరస్పరం దాడులకు యత్నించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. 

Updated Date - 2022-06-21T16:53:15+05:30 IST