వార్డు వలంటీర్ ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-07-25T06:34:06+05:30 IST
పట్టణంలోని కేతిరెడ్డికాలనీకి చెందిన ధనుంజయ ఇంట్లోని మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు.
ధర్మవరం, జూలై 24: పట్టణంలోని కేతిరెడ్డికాలనీకి చెందిన ధనుంజయ ఇంట్లోని మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివ రాల మేరకు...కేతిరెడ్డికాలనీలో వార్డువలంటీర్గా పనిచేస్తున్న ధనుంజయ శుక్రవారం రాత్రి జబ్బులకు తెచ్చిపెట్టుకున్న మాత్రలు మింగాడు. కుటుంబసభ్యు లు ఉదయాన్నే గమనించి వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్సలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. అయితే వలం టీర్ ఆత్మహత్యాయత్నంకు గల కారణాలు తెలియరా లేదు. పోలీసులు కేసు న మోదు చేసుకుని విచారణ చేపట్టారు.