వార్డు వలంటీర్లు ఎన్నికల పనుల్లో పాల్గొనొద్దు
ABN , First Publish Date - 2021-03-07T04:42:21+05:30 IST
మున్సిపాలిటీల పరిఽధిల్లోని సచివాలయాల్లో పనిచేస్తున్న వార్డు వలంటీర్లు ఎన్నికల పనుల్లో ప్రత్య
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 6: మున్సిపాలిటీల పరిఽధిల్లోని సచివాలయాల్లో పనిచేస్తున్న వార్డు వలంటీర్లు ఎన్నికల పనుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా గానీ పాల్గొనకూడదని ఎన్నికల అధికారి ఎం.హరినారాయణన్ ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రటనట విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చిత్తూరు, తిరుపతి నగరపాలక సంస్థలు, మదనపల్లె, పలమనేరు, పుత్తూరు, నగరి మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా సచివాలయాల్లో పనిచేస్తున్న వలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం, రాజకీయ పార్టీలకు లబ్ధి చేకూర్చడం, ఓటర్లను ప్రభావితం చేయడం వంటి కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని నిషేధించినట్లు చెప్పారు. ఎక్కడైనా వార్డు వలంటీర్లు ఎన్నికల పనుల్లో పాల్గొంటే కలెక్టరేట్లో కాల్ సెంటర్ నెంబర్లు 08572-242744, 242433, 242727 వాట్సాప్ నెంబరు 7013158511కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.