కలిసికట్టుగా మత్తును వదిలించాలి

ABN , First Publish Date - 2021-10-27T05:31:52+05:30 IST

కలిసికట్టుగా మత్తును వదిలించాలి

కలిసికట్టుగా మత్తును వదిలించాలి
మాట్లాడుతున్న డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి

  వెస్ట్‌జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి

వర్ధన్నపేట, అక్టోబరు 26 : గ్రామాల్లో ప్ర జా ప్రతినిధులు, అధికారులు, యువకులు, మేధావులు ప్రతీ ఒక్కరం కలిసికట్టుగా పని చేసి మత్తు పదార్ధాల నివారణకు నడుం బి గించాలని వెస్ట్‌జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి అ న్నారు. పట్టణంలోని ఎంఎంఆర్‌ గార్డెన్‌లో వ ర్ధన్నపేట సర్కిల్‌ పరిధిలో మంగళవారం గం జాయి, ఇతర మత్తు పదార్థాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సంద ర్భంగా మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్ధాలు, యువత బానిసై చెడు వ్యసనాలతో జరిగే ప్రభావాలపై ప్రొజెక్టర్‌ ద్వారా ప్రదర్శిం చారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ వరం గల్‌ సీపీ తరుణ్‌ జోషి ఆదేశాల మేరకు గ్రా మాల్లోని యువత, ఇతర ప్రజలు మత్తు ప దార్ధాలకు బానిస కాకుండా వారిని కాపాడుకో వాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంద న్నారు. గంజాయి, ఇతర వాటిని నిర్మూలించడానికి ఒక్క పోలీస్‌ ద్వారానే కాకుండా ఇతర అధికా రులు, ప్రజాప్రతినిధులు, యువకుల సహకా రంతోనే దీనిని నిర్మూలించవచ్చన్నారు. పోలీ సులు 24గంటల పాటు అందుబాటులో ఉం టారని, మత్తు పదార్థాలపై ఎలాంటి సమా చారం ఉన్న తెలియ చేయాలని కోరారు. వి వరాలు అందించిన వారి పేర్లు గోప్యంగా ఉం చుతామని, మన పరిధిలో గంజాయి లాంటి వాటికి స్వస్తి పలికే వరకు విశ్రమించకుండా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న ట్లు తెలిపారు. మత్తు పదార్థాలకు లోనైతై జరిగే పరిణామా లతో పాటు క్రిమినల్‌ యాక్టివిటీస్‌కు ప్రేరేపిం చేలా చేస్తాయని గుర్తు చేశారు. ఈ సదస్సు లో వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేష్‌, సీఐ సదన్‌కుమార్‌, తహసీల్దార్లు నాగ రాజు, సత్య నారాయణ, ఎస్‌ఐలు రామారావు, బండారి రాజు, ఆయా గ్రామాల అధికారులు, ప్రజాప్ర తినిధులు పాల్గొన్నారు.

 


Updated Date - 2021-10-27T05:31:52+05:30 IST