విలియమ్సన్ రాకతో మా బలం పెరిగింది: వార్నర్

ABN , First Publish Date - 2021-04-22T16:19:21+05:30 IST

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఎట్టకేలకు తొలి విజయం అందుకుంది.

విలియమ్సన్ రాకతో మా బలం పెరిగింది: వార్నర్

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఎట్టకేలకు తొలి విజయం అందుకుంది. పంజాబ్‌ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అన్ని విభాగాల్లోనూ సమష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. విలియమ్సన్ చేరిక గురించి కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. 


`ఈ విజయంలో మా బౌలర్లదే కీలక పాత్ర. అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను మా చేతుల్లోకి తీసుకొచ్చారు. ఈ విజయంతో మాపై ఒత్తిడి తగ్గింది. విలియమ్సన్‌ తుది జట్టులో ఉండడంతో మా బలం పెరిగింది. అతని రాక వల్ల టీమ్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ విజయం మాకు కొత్త ఊపిరినిచ్చింది. రానున్న మ్యాచ్‌ల్లోనూ ఇలాగే మెరుగైన ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తామ`ని వార్నర్ అన్నాడు. 

Updated Date - 2021-04-22T16:19:21+05:30 IST