జడ్జిలపై పోస్టులు పెట్టిన రాజశేఖరరెడ్డిపై వారెంట్‌

ABN , First Publish Date - 2021-07-26T09:11:45+05:30 IST

న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టింగ్స్‌ పెట్టిన కేసులో నిందితుడైన లింగారెడ్డి రాజశేఖరరెడ్డిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది.

జడ్జిలపై పోస్టులు పెట్టిన రాజశేఖరరెడ్డిపై వారెంట్‌

గుంటూరు, జూలై 25: న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టింగ్స్‌ పెట్టిన కేసులో నిందితుడైన లింగారెడ్డి రాజశేఖరరెడ్డిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. ఈ కేసులో కడప జిల్లాకు చెంది న లింగారెడ్డి రాజశేఖరరెడ్డి 15వ నిందితుడిగా ఉన్నాడు. అయితే అతడు గత శుక్రవారం ఈ కేసులో మొదటి వాయిదాకు హాజరవ్వాల్సి ఉన్నప్పటికీ రాలేదు. దీంతో నిందితుడిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ జారీ చేశారు. దీంతో సీబీఐ బృందాలు అతడిని అరెస్టు చేసేందుకు రంగంలోకి దిగాయి.

Updated Date - 2021-07-26T09:11:45+05:30 IST