ఇంట్లో మరో యువకుడితో భార్య మాటలు.. ఆ దృశ్యం చూసి తట్టుకోలేకపోయిన భర్త ఎంత ఘోరానికి పాల్పడ్డాడంటే..
ABN , First Publish Date - 2022-02-03T22:55:20+05:30 IST
అతనికి భార్యపై అనుమానం.. ఆమె వేరే వ్యక్తులతో మాట్లాడినా తట్టుకోలేడు..
అతనికి భార్యపై అనుమానం.. ఆమె వేరే వ్యక్తులతో మాట్లాడినా తట్టుకోలేడు.. గత నెల 31వ తేదీ రాత్రి అతను ఇంటికి వెళ్లే సమయానికి భార్య వేరే యువకుడితో మాట్లాడుతూ కనిపించింది.. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతను భార్యపై దాడి చేశాడు.. ఆమె చనిపోయే వరకు కర్రతో కొడుతూనే ఉన్నాడు.. అనంతరం అదృశ్యమయ్యాడు.. పోలీసులు గాలించి అతడిని అరెస్ట్ చేశారు.. చత్తీస్గఢ్లోని బిలాస్పూర్కు సమీపంలో ఈ ఘటన జరిగింది.
బిలాస్పూర్కు సమీపంలోని బలరామ్పూర్లో నివసిస్తున్న రామ్నాథ్, బృహస్పతి దంపతులకు నాలుగేళ్ల కూతురు ఉంది. భార్యకు వేరే పురుషులతో వివాహేతర సంబంధాలున్నాయని రామ్నాథ్ తరచుగా ఆరోపిస్తూ ఉండేవాడు. గత నెల 31వ తేదీ రాత్రి రామ్నాథ్ మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. అప్పటికి అతని భార్య పక్కింటి యువకుడితో మాట్లాడుతూ కనిపించింది. దాంతో ఆగ్రహానికి గురైన రామ్నాథ్ ఓ కర్ర తీసుకుని దాడికి ప్రయత్నించాడు. దాంతో ఆ యువకుడు పారిపోయాడు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె చనిపోయే వరకు కొడుతూనే ఉన్నాడు. ఆమె మృతదేహం వద్దే ఆ రాత్రంతా కూతురితో కలిసి గడిపాడు. తర్వాతి రోజు ఉదయం కూతురిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని రామ్నాథ్ గురించి అన్వేషణ ప్రారంభించారు. బుధవారం మధ్యాహ్నం రామ్నాథ్ను అరెస్ట్ చేశారు. పోలీసుల ఎదుట అతను తన నేరాన్ని అంగీకరించాడు.