-
-
Home » Andhra Pradesh » watching movie Eluru-MRGS-AndhraPradesh
-
సినిమా చూస్తూ కన్నుమూత
ABN , First Publish Date - 2022-05-10T02:19:34+05:30 IST
సినిమా చూస్తూనే ఓ వ్యక్తి కన్నుమూశాడు. జిల్లా కేంద్రమైన ఏలూరులోని సత్యనారాయణ థియేటర్ స్ర్కీన్-1లో కేజీఎఫ్-2 సినిమా ప్రదర్శిస్తున్నారు.
ఏలూరు: సినిమా చూస్తూనే ఓ వ్యక్తి కన్నుమూశాడు. జిల్లా కేంద్రమైన ఏలూరులోని సత్యనారాయణ థియేటర్ స్ర్కీన్-1లో కేజీఎఫ్-2 సినిమా ప్రదర్శిస్తున్నారు. 30 ఏళ్ల వయస్సు కలిగిన ఓ వ్యక్తి మధ్యాహ్నం మ్యాట్నీకి వెళ్లాడు. సినిమా అయిపోయిన తరువాత కుర్చీలోనే నిద్రపోతూ ఉండిపోయాడు. థియేటర్ శుభ్రం చేసే సిబ్బంది చూసి లేపారు. ఎంతకూ లేవకపోవడంతో అతన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతని ఆచూకీ తెలియాల్సి ఉంది.