కోసిగి బాలుర హై స్కూల్లో నీటి కొరత
ABN , First Publish Date - 2021-04-18T05:06:34+05:30 IST
కోసిగిలోని జడ్పీబాలుర ఉన్నత పాఠశాలలో 1,100 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే పాఠశాలలోని బోరు చెడిపోయి పది రోజుల నుంచి తాగునీరు రావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.
కోసిగి, ఏప్రిల్ 17: కోసిగిలోని జడ్పీబాలుర ఉన్నత పాఠశాలలో 1,100 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే పాఠశాలలోని బోరు చెడిపోయి పది రోజుల నుంచి తాగునీరు రావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో ట్యాంకుల దగ్గరకు వెళ్లాల్సి వస్తోంది. పాఠశాలలో ఆర్డీటీ సంస్థ ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.