300 ఎకరాలకు అందని నీరు

ABN , First Publish Date - 2021-10-27T05:03:51+05:30 IST

సాగునీటి సమస్యను తీరుస్తామని ఇరిగేషన్‌ అధికారులు అన్నారు.

300 ఎకరాలకు అందని నీరు
పంట పొలాలను పరిశీలిస్తున్న అధికారులు

ఇరిగేషన్‌, వ్యవసాయాధికారుల పరిశీలన


వీరవాసరం, అక్టోబరు 26 : సాగునీటి సమస్యను తీరుస్తామని ఇరిగేషన్‌ అధికారులు అన్నారు. రాయకుదురు తూర్పుకాలువపై వరిచేలకు సాగునీటి సమస్య ఎదురైంది. పంట చేలకు నీరందకపోవడంతో సార్వాచేలు నెర్రలు కొట్టే పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు  సమస్యను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ దృష్టికి తీసుకువెళ్ళారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మంగళవారం ఇరిగేషన్‌, వ్యవసాయశాఖల అధికారులు తూర్పుకాలువ ఆయకట్టు భూములను పరిశీలించారు. రాయకుదురు నుంచి జొన్నపాలెం వరకూ సుమారు 300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందడం లేదని గుర్తించారు.  సాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో ఇరిగేషన్‌ డీఈ కె.రవీంద్రబాబు, ఏడీఏ పి.ఉషాకుమారి , సర్పంచ్‌ భారతి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T05:03:51+05:30 IST