త్వరలో సాగునీటిని విడుదల చేయిస్తాం

ABN , First Publish Date - 2021-01-25T03:01:06+05:30 IST

యాసంగి పంటకు ఇబ్బంది రాకుండా త్వరలో సాగునీటిని అందించేందుకు కృషిచేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

త్వరలో సాగునీటిని విడుదల చేయిస్తాం
మంత్రి నిరంజన్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందిస్తున్న రైతులు

 రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 

రేవల్లి, జనవరి 24: యాసంగి పంటకు ఇబ్బంది రాకుండా త్వరలో సాగునీటిని అందించేందుకు కృషిచేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మండలంలోని చెన్నారం గ్రామ రైతులు ఆదివారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. కేఎల్‌ఐ కాల్వను నమ్ముకొని పంటలు సాగుచేశామని, నీళ్లు రాకపోతే పంటలు ఎండిపోయే ప్రమాదముందని వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.  మంత్రి స్పందిస్తూ అధికారులతో మాట్లాడి చెన్నారం, కేశంపేట, గొల్లపల్లి చెరువులు నింపుతామని  హామీ ఇచ్చారు. రమేష్‌యాదవ్‌,  తిరుపతి యాదవ్‌, నాగిరెడ్డి, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు బిచ్చి దాస్‌, రవీందర్‌రెడ్డి, రాముడు, దశరథం, శ్రీశైలం, వెంకటరావు, కమ్మరి నాగయ్య, సౌడయ్య, ఈశ్వరయ్య ఉన్నారు. 

Updated Date - 2021-01-25T03:01:06+05:30 IST