సత్యసాయిగంగ కాలువకు నీరు నిలిపివేత

ABN , First Publish Date - 2021-09-18T03:51:45+05:30 IST

కండలేరు డ్యాం నుంచి చెన్నై, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు నీటి విడుదలను శుక్రవారం నుంచి నిలిపేశారు.

సత్యసాయిగంగ కాలువకు నీరు నిలిపివేత
హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి నిలచిన ప్రవాహం

కండలేరులో 57.052 టీఎంసీల నీరు

రాపూరు, సెప్టెంబరు, 17: కండలేరు డ్యాం నుంచి చెన్నై, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు నీటి విడుదలను శుక్రవారం నుంచి నిలిపేశారు. ఈ వాటర్‌ ఇయర్‌లో ఇప్పటిదాకా  డ్యాం నుంచి 18.40టీఎంసీల నీటిని విడుదల చేయగా, అందులో చెన్న్తైకి 5 టీఎంసీలు, రెండు జిల్లాల్లో తాగు, సాగు నీటి అవసరాలకు 13.40 టీఎంసీల నీటిని వినియోగించినట్లు డ్యాం ఇంజనీర్లు ప్రకటించారు. శుక్రవారం డ్యాంలో 57.052 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 1700 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 225 క్యూసెక్కులు ఉంది.  ఈ వాటర్‌ ఇయర్‌లో డ్యాంకు వరద ద్వారా 2.34 టీఎంసీలు, సోమశిల నుంచి 27.40 టీఎంసీలు అందాయి. 

Updated Date - 2021-09-18T03:51:45+05:30 IST