నీటి కోసం అల్లాడుతున్నాం!
ABN , First Publish Date - 2022-08-13T06:11:56+05:30 IST
నీటి కోసం అల్లాడుతున్నాం!
పట్టించుకున్న నాథుడే లేడు.. ఎమ్మెల్యే కొడాలి నానీని నిలదీసిన 11వ వార్డు మహిళలు
గుడివాడ టౌన్, ఆగస్టు 12: కొన్ని నెలలుగా గుక్కెడు తాగునీటి కోసం అల్లాడుతున్నాం. మమ్మల్ని పట్టించుకున్న నాథుడే లేడని 11వ వార్డు మహిళలు ఎమ్మెల్యే కొడాలి నానీని నిలదీశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 11వ వార్డులో శుక్రవారం ఆయన పర్యటించారు. టిడ్కో ఇళ్లు ఇవ్వకుంటే డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఎమ్మెల్యేను మహిళలు కోరారు. జగనన్న స్థలాలు కొందరికి రాలేదని పింఛన్లు ఆగాయని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. గుడ్మెన్పేట వాటర్ ట్యాంక్ పూర్తి కావచ్చిందని త్వరలో నీరు ఇస్తామని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. ఇతర సమస్యలు పరిష్కరించాలని అధికారులను పిలిచి ఆదేశించారు. దుక్కిపాటి శశిభూషణ్, మునిసిపల్ కమిషనర్ పీజే సంపత్కుమార్, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, పాలేటి చంటి, ఎం.వి.నారాయణరెడ్డి, గొర్ల శ్రీను పాల్గొన్నారు.