3 రాజధానులకు కట్టుబడి ఉన్నాం: ధర్మాన

ABN , First Publish Date - 2022-03-06T17:29:49+05:30 IST

3 రాజధానులకు కట్టుబడి ఉన్నామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

3 రాజధానులకు కట్టుబడి ఉన్నాం: ధర్మాన

శ్రీకాకుళం: 3 రాజధానులకు కట్టుబడి ఉన్నామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలోనే అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా.. 3 రాజధానులకు ప్రతిపాదన చేశామని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన పని స్వార్థపూరితమైనదని తప్పుబట్టారు. ఒక సామాజికవర్గ ప్రయోజనం కోసమే చంద్రబాబు తపనపడుతున్నారని ధర్మాన కృష్ణప్రసాద్ మండిపడ్డారు.


ఇప్పటికే మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మాజీమంత్రి యనమల రామకృష్ణ తమకు మాండేటరీ కాదన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని భావిస్తోందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.  

Updated Date - 2022-03-06T17:29:49+05:30 IST