మూడు రాజధానుల అంశానికి కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే గుడివాడ

ABN , First Publish Date - 2022-03-03T23:58:37+05:30 IST

ఏపీకి మూడు రాజధానులు అంశానికి కట్టుబడి ఉన్నామని అనకాపల్లి

మూడు రాజధానుల అంశానికి కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే గుడివాడ

విశాఖ: ఏపీకి మూడు రాజధానులు అంశానికి కట్టుబడి తాము ఉన్నామని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని విషయంలో హైకోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామన్నారు. ఈ తీర్పు తమకు ఆశ్చర్యం కలిగించలేదన్నారు.  రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతోనే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్నిప్రాంతాలు అభివృద్ధి జరిగితే వచ్చే నష్టం ఏమిటో చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు అన్యాయం జరిగితే టీడీపి నేతలు పండగ చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఉత్తరాంధ్ర లో ఓటుని అడిగే హక్కుచంద్రబాబు కోల్పోయారని ఆయన విమర్శించారు. వైఎస్ ఫ్యామిలీ మాత్రమే ఉత్తరాంధ్రని అభివృద్ధి చేసిందని ఆయన స్పష్టం చేశారు. ఇంతకంటే తామే అభివృద్ధి చేసామని టీడపీ నేతలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ఆయన సవాల్ విసిరారు. 

Updated Date - 2022-03-03T23:58:37+05:30 IST