సింగరేణిని ఆదర్శ సంస్థగా తీర్చిదిద్దుతున్నాం
ABN , First Publish Date - 2021-03-06T06:23:00+05:30 IST
సింగరేణిని ఇతరసంస్థలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతు న్నామని సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్, పీఆండ్పీ బలరాం పేర్కొన్నారు.
సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ పీఆండ్పీ బలరాం
శ్రీరాంపూర్, మార్చి 5: సింగరేణిని ఇతరసంస్థలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతు న్నామని సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్, పీఆండ్పీ బలరాం పేర్కొన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ఆర్కే7గనిలో నూతనంగా 1.20కోట్లతో ఏర్పాటుచేసిన చైర్కార్ మ్యాన్రైడింగ్ సిస్టంను డైరెక్టర్ బలరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డైరెక్టర్ బలరాం, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి మాట్లాడారు. సింగరేణి సంస్థ తెలంగాణ ప్రాంతానికి ఒక ఉపాది తరవుగా నిలుస్తూ ఒక బలీయమైన శక్తిగా ఉందన్నారు.