నాగమ్మ చెరువుకు పర్యాటక శోభ తీసుకొస్తాం

ABN , First Publish Date - 2022-05-25T04:19:08+05:30 IST

సిర్పూరు మండల కేంద్రంలో నాగమ్మ చెరువుకు పర్యాటక శోభ తీసుకొస్తామని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. నాగమ్మ చెరువులో బుద్దవిగ్రహాం ఏర్పాటు పనులను మం గళవారం ఎమ్మెల్యే పరిశీలించారు

నాగమ్మ చెరువుకు పర్యాటక శోభ తీసుకొస్తాం
బుద్ద విగ్రహం ఏర్పాటు పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

-సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 

సిర్పూరు(టి), మే 24: సిర్పూరు మండల కేంద్రంలో నాగమ్మ చెరువుకు పర్యాటక శోభ తీసుకొస్తామని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు.  నాగమ్మ చెరువులో బుద్దవిగ్రహాం ఏర్పాటు పనులను మం గళవారం ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  మండల కేంద్రంలోని అతి ప్రాచీనమైన 70 ఎకరాల నాగమ్మ చెరు వును మిని ట్యాంక్‌ బండ్‌గా  తీర్చిదిద్దుతామని చెప్పారు. ఆయన వెం ట జడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, ఉప సర్పంచ్‌ తోట మహేష్‌,  టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు తుకారం, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్య కర్తలు, సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T04:19:08+05:30 IST