మనవడి పుట్టు వెంట్రుకలు తీసేందుకు వచ్చాం

ABN , First Publish Date - 2022-09-23T07:41:19+05:30 IST

శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులు తమపై ఉండాలని, తన మనవడు సర్వజ్ఞ పుట్టువెంట్రుకలు తీసేందుకు వచ్చానని సినీనటుడు తనికెళ్ల భరణి అన్నారు.

మనవడి పుట్టు వెంట్రుకలు తీసేందుకు వచ్చాం
ఆలయం ముందు కుటుంబీకులతో తనికెళ్ల భరణి

తిరుమలలో సినీనటుడు తనికెళ్ల భరణి


తిరుమల, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులు తమపై ఉండాలని, తన మనవడు సర్వజ్ఞ పుట్టువెంట్రుకలు తీసేందుకు వచ్చానని సినీనటుడు తనికెళ్ల భరణి అన్నారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దర్శనార్థం నిత్యం తిరుమలకు వస్తూనే ఉంటానన్నారు. ఎన్నిసార్లు స్వామిని చూసినా తనివి తీరదన్నారు. ఈసారి కుటుంబ సభ్యులందరికి స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించానని చెప్పారు. 

Updated Date - 2022-09-23T07:41:19+05:30 IST