ఇక్కడ తిండి తిని Pakistan Zindabad అనే వారిని వదిలి పెట్టం...
ABN , First Publish Date - 2022-04-04T17:34:54+05:30 IST
కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు....
Karnataka Minister ఈశ్వరప్ప హెచ్చరిక
బెంగళూరు: కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక్కడ పండే ఆహారాన్ని తిని పాకిస్థాన్ జిందాబాద్ అని చెప్పేవారిని వదిలిపెట్టబోమని మంత్రి ఈశ్వరప్ప హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముస్లింలను మభ్యపెడుతోందని మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఆరోపించారు. ‘‘మన దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ముస్లింలను గౌరవిస్తాం కానీ, ఇక్కడ పండే తిండి తింటూ పాకిస్థాన్ జిందాబాద్ చెప్పేవారిని మాత్రం వదిలిపెట్టబోం’’అని ఈశ్వరప్ప అన్నారు.కాంగ్రెస్ నిత్యం ముస్లింలను మభ్యపెడుతోందని, ఇది సరికాదని మంత్రి హితవు చెప్పారు.
కేఎస్ ఈశ్వరప్పపై దేశద్రోహం, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయాల్సిందిగా శివమొగ్గ జిల్లాలోని దొడ్డపేట పోలీసులను ప్రత్యేక కోర్టు ఇటీవల ఆదేశించింది.‘‘కాంగ్రెస్ పార్టీ వాళ్లు ముస్లింలను మభ్యపెడుతున్నారు. ఇది మంచిది కాదు. మేం హిందుత్వవాదులం. మేం పుట్టినప్పటి నుంచి హిందుత్వం గురించి మాట్లాడుతున్నాం కానీ మేం ముస్లింలను వ్యతిరేకించం’’అని ఈశ్వరప్ప స్పష్టం చేశారు.