‘మా కుమార్తెకు న్యాయం చేయాలి’

ABN , First Publish Date - 2022-04-26T01:52:17+05:30 IST

తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచారానికి గురైన బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

‘మా కుమార్తెకు న్యాయం చేయాలి’

అమరావతి: తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచారానికి గురైన బాధితురాలి తల్లిదండ్రులు ఎన్టీఆర్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద  తల్లిదండ్రులు  కన్నీరు పెట్టి విలపించారు. ‘‘మీకు న్యాయం చేశాం కదా ఇంకెందుకు రాద్ధాంతం అంటూ దిశా పోలీసులు మమ్మల్ని బెదిరిస్తున్నారు. డబ్బులిస్తే న్యాయం జరిగిపోయినట్లు భావిస్తున్నారు. ఘటన తర్వాత మా అమ్మాయి ఫలానా చోట ఉంది తెచ్చుకోండి అన్నారే తప్ప ఒక్క పోలీసు మాకు సాయం  చేయలేదు. మా కుటుంబానికి జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదనే మా పోరాటం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-04-26T01:52:17+05:30 IST