తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలి
ABN , First Publish Date - 2021-02-26T04:28:06+05:30 IST
విద్యుత్ కార్మికులు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలని తెలంగాణ స్టేట్ ఎలక్ర్టిసీటీ ఎంప్లాయీస్ యూనియన్-327 యూనియన్ రీజియన్ కార్యదర్శి ఎం.డి షాహెద్అలీ, పి.బాబ్యలు పిలుపునిచ్చారు
పాలమూరు, ఫిబ్రవరి 25: విద్యుత్ కార్మికులు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలని తెలంగాణ స్టేట్ ఎలక్ర్టిసీటీ ఎంప్లాయీస్ యూనియన్-327 యూనియన్ రీజియన్ కార్యదర్శి ఎం.డి షాహెద్అలీ, పి.బాబ్యలు పిలుపునిచ్చారు. ఉద్యోగులు, ఆర్టిజ న్స్, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గురువారం చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన మాట్లాడారు. లాభాల్లో నడుస్తున్న విద్యుత్ సంస్థను కార్పొరేట్ కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను ఉద్యోగులు, కార్మికులు తిప్పికొ ట్టాలన్నారు. దీక్షలో రఫీక్అహ్మద్, అశ్రఫ్అలీ, జగదీష్గౌడ్, రాములు, ఖాజాపాషా, రాంచంద్రయ్య, శివశంకర్, గిరిబాబు, వి.రాజు, రాములు, రాఘవేందర్, సిరాజ్అలీ, వి.నరేందర్, భానుసందీప్, శివ, పెంటయ్య, కె.చిన్ననరసింహులు, కె.బాలకిష్టయ్య, ఎం.రాములు కూర్చున్నారు.