జగన్ను సాగనంపేందుకు సిద్ధం కావాలి
ABN , First Publish Date - 2022-09-26T04:46:00+05:30 IST
అవినీతి, అసమర్థ, అరాచక పాలన చేస్తున్న జగన్మోహన్రెడ్డిని సాగనంపేందుకు సమయం ఆసన్నమవుతోందని బీజేపీ రాయలసీమ ఇన్చార్జి పనతల సురేష్ తెలిపారు.
బీజేపీ రాయలసీమ ఇన్చార్జి పనతల సురేష్
రాజంపేట, సెప్టెంబరు 25 : అవినీతి, అసమర్థ, అరాచక పాలన చేస్తున్న జగన్మోహన్రెడ్డిని సాగనంపేందుకు సమయం ఆసన్నమవుతోందని బీజేపీ రాయలసీమ ఇన్చార్జి పనతల సురేష్ తెలిపారు. రాజంపేట బీజేపీ కార్యాల యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లా డుతూ జగన్మోహన్రెడ్డి అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీజేపీ ప్రజాపోరు యాత్రలో ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఎన్నికల ముందర ఇచ్చిన వాగ్దానాలకు, అమలు చేస్తున్న పథకాలకు పొంతన లేకుండా పోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను తమ పథకాలుగా గొప్పలు చెప్పుకుంటూ పబ్బం గడుపుతూ స్టిక్కర్ ప్రభుత్వంగా మారిందన్నారు. బీజేపీ ప్రజాపోరు యాత్రలో భాగంగా రాయలసీమలో 2,951 సభలు నిర్వహించి 10.76 లక్షల మందికి జగన్ అరాచక పాలన గురించి వివరించామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జి పోతుగుంట రమేష్నాయుడు, బీజేపీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ, నాగ రాజు, నగేష్, సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు.