మన దేశంలో అలాంటి క్రీడా సంస్కృతిని పెంచాలి: ఉప రాష్ట్రపతి

ABN , First Publish Date - 2022-04-25T03:35:23+05:30 IST

అంతే కాకుండా ఆటలు, క్రీడలు, యోగా మన పాఠశాల పాఠ్యాంశాల్లో అతర్భాగంగా ఉండాలని ఆయన అన్నారు. ఆదివారం బెంగళూరులోని ఖేలో ఇండియా యూనిర్సిటీ క్రీడల ప్రారంభోత్సవానికి ఉప రాష్ట్రపతి ముఖ్య అతిథిగా..

మన దేశంలో అలాంటి క్రీడా సంస్కృతిని పెంచాలి: ఉప రాష్ట్రపతి

బెంగళూరు: క్రీడలను ఆచరణీయమైన కెరియర్‌గా ఎంచుకునే క్రీడా సంస్కృతిని మన దేశంలో పెంచాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అంతే కాకుండా ఆటలు, క్రీడలు, యోగా మన పాఠశాల పాఠ్యాంశాల్లో అతర్భాగంగా ఉండాలని ఆయన అన్నారు. ఆదివారం బెంగళూరులోని ఖేలో ఇండియా యూనిర్సిటీ క్రీడల ప్రారంభోత్సవానికి ఉప రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో క్రీడలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహం గురించి వివరించారు. కాగా, ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మ, కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-25T03:35:23+05:30 IST