ప్రజలకు మెరుగైన సేవలందించాలి

ABN , First Publish Date - 2021-07-30T06:36:58+05:30 IST

గ్రామ, వార్డు సచివా లయాల ఉద్యోగులు జవాబుదారీగా పనిచేస్తూ... ప్రజలకు మె రుగైన సేవలందించాలని అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతి రాణా టాటా, ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశించారు.

ప్రజలకు మెరుగైన సేవలందించాలి
బుక్కరాయసముద్రం సచివాలయ ఉద్యోగులు, సిబ్బందితో మాట్లాడుతున్న డీఐజీ కాంతిరాణా టాటా, ఎస్పీ ఫక్కీరప్ప


గ్రామ సచివాలయాలను సందర్శించిన డీఐజీ, ఎస్పీ

బుక్కరాయసముద్రం, జూలై29 : గ్రామ, వార్డు సచివా లయాల ఉద్యోగులు జవాబుదారీగా పనిచేస్తూ... ప్రజలకు మె రుగైన సేవలందించాలని అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతి రాణా టాటా, ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశించారు. వారు గురువారం వారు బుక్కరాయసము ద్రం మండల కేంద్రంలోని గ్రామ సచి వాలయంతో పాటు రేకులకుంట గ్రామ సచివాలయాన్ని సం దర్శించారు. ముందుగా ఉద్యోగుల విధులు, ప్రజలకు ఎలాంటి సేవలు అందుతున్నాయి...? సచివాలయం ఏర్పడ్డాక జరిగిన అభివృద్ధిపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందితో ముఖాముఖి మాట్లాడారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ను వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపాల్‌ గీతాదేవి, డీఎస్పీలు వీర రాఘవరెడ్డి, మల్లికార్జున వర్మ, సీఐ సాయిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

రాప్తాడు: డీఐజీ క్రాంతిరాణా టాటా గురువారం సాయం త్రం రాప్తాడు గ్రామ సచివాలయాన్ని జిల్లా ఎస్పీ ఫక్కీరప్పతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డీఐజీ సచివాలయ సి బ్బందితో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పఽథకాల అమలుపై అడిగి తెలుసుకున్నారు. రాప్తాడు గ్రామ పంచాయతీలో అభి వృద్ధి పనులు తదితర వివరాలను సర్పంచ తిరుపాలుతో ఆరా తీశారు. అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సాల్మనరాజ్‌, సర్పంచ తిరుపాలు, అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, ఇటుకలపల్లి సీఐ విజయభాస్కర్‌గౌడ్‌, రాప్తాడు ఎస్‌ఐ ఆంజనేయులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-30T06:36:58+05:30 IST