బాధితురాలికి అండగా ఉంటాం: వాసిరెడ్డి పద్మ
ABN , First Publish Date - 2021-06-21T20:51:23+05:30 IST
ప్రియుడ్ని కట్టేసి ప్రియురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కరఘాట్ల వద్ద శనివారం రాత్రి జరిగింది.
గుంటూరు: తాడేపల్లి అత్యాచార ఘటన దురదృష్టకరం, బాధాకరమని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మా అన్నారు. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితురాలిని వాసిరెడ్డి పద్మా పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మ మీడియాతో మాట్లాడుతూ.. బాధితురాలితో మాట్లాడానని. ధైర్యం చెప్పానన్నారు. ఆమెకు ధైర్యాన్ని నింపాల్సిన పరిస్థితి మనపై ఉందన్నారు.
బాధితురాలికి అండదండగా ఉంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. బ్లేడ్ బ్యాచ్ ఈ అఘాయిత్యానికి పాల్పడిందన్నారు. త్వరలోనే ఈ కేసును చేధిస్తామని చెప్పారు. పోలీసుల కళ్లు కప్పి తప్పించుకున్న నిందితులకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. మహిళా రక్షణ కోసమే ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు.