కార్యకర్తలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే బాలకృష్ణ

ABN , First Publish Date - 2020-08-09T10:27:06+05:30 IST

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే మూల స్తంభాలనీ, వారికి ఎలాంటి కష్టమొచ్చినా అండగా ఉండి ఆదుకుంటామని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే బాలకృష్ణ

మృతుడి కుటుంబానికి  రూ.20 వేల ఆర్థిక సాయం


లేపాక్షి, ఆగస్టు 8:  తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే మూల స్తంభాలనీ, వారికి ఎలాంటి కష్టమొచ్చినా అండగా ఉండి ఆదుకుంటామని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. లేపాక్షిలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన టీడీపీ నాయకుడు కురుబ శివకుమార్‌ కుటుంబానికి శనివారం రూ.20 వేల ఆర్థిక సా యాన్ని ఆయన స్థానిక నాయకుల ద్వారా అం దించారు. ఈ సందర్భంగా ఫోన్‌లో బాధిత కు టుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్య పడ వద్దనీ, పార్టీ అండగా ఉంటుందన్నారు. శివకుమార్‌ పిల్లల చదువులకు సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ జయప్ప, ఎమ్మెల్యే పీఏ బాలాజీ, ఎంపీపీ ఆనంద్‌కుమార్‌, నీరుగంటిరామాంజి పాల్గొన్నారు.

Updated Date - 2020-08-09T10:27:06+05:30 IST