సింగరేణి స్థలాలను ప్రజల అవసరాలకు వినియోగిస్తాం

ABN , First Publish Date - 2021-06-17T05:43:50+05:30 IST

సింగరేణి ఆధీనంలో ఉన్న స్థలాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ చెప్పారు.

సింగరేణి స్థలాలను ప్రజల అవసరాలకు వినియోగిస్తాం
జీఎంతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చందర్‌

- రామగుండాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతాం   

- ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

గోదావరిఖని, జూన్‌ 16: సింగరేణి ఆధీనంలో ఉన్న స్థలాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ చెప్పారు. బుధవారం ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. సింగరేణి ఆధీనంలో ఉన్న స్థలాలను కమ్యూనిటీ హాల్స్‌కు, ఇంటిగ్రేట్‌ మార్కెట్ల నిర్మాణాలకు ఉపయోగిస్తామని, ఖాళీ స్థలాలను కార్పొరేషన్‌కు అప్పజెప్పాలని జీఎంను కోరారు. డీఎంఎఫ్‌టీ, సీఎంఏ గ్రాంట్‌ నిధుల ద్వారా జీఎం కార్యాలయం వద్ద ఉన్న స్థలంలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, స్విమ్మింగ్‌పూల్‌, ఫైవింక్లయిన్‌, విఠల్‌నగర్‌, కేసీఆర్‌కాలనీ,జనగామలో కమ్యూనిటీహాల్స్‌ నిర్మాణం కోసం సింగరేణి స్థలాలను ఇవ్వాలని కోరారు. అదే వి ధంగా మున్సిపల్‌ టీ జంక్షన్‌ నుంచి ఫైవింక్లయిన్‌ చౌ రస్తావరకు వంద ఫీట్ల రోడ్డు నిర్మాణం కోసం రూ.10 కోట్లు మంజూరు చేయాలని సింగరేణి సీఎండీని కోరగా ఆయన స్పందించి వందఫీట్ల రోడ్డు నిర్మాణం కో సం రూ.10కోట్లు మంజూరుచేశారని, త్వరలోనే టెండ ర్ల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. రామగుండాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, సమస్యలు లేని నగరంగా రామగుండంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మె ల్యే చెప్పారు. ఈ సమావేశంలో మేయర్‌ అనీల్‌ కు మార్‌, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T05:43:50+05:30 IST