‘క్రైస్తవుల డిమాండ్లను పరిష్కరిస్తాం’

ABN , First Publish Date - 2021-12-05T05:43:48+05:30 IST

కైస్త్రవుల డిమాండ్లను పరిష్కరిస్తామని నంద్యాల, నందికొట్కూరు ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, ఆర్థర్‌ అన్నారు.

‘క్రైస్తవుల డిమాండ్లను పరిష్కరిస్తాం’

నంద్యాల(నూనెపల్లె), డిసెంబరు 4: కైస్త్రవుల డిమాండ్లను పరిష్కరిస్తామని నంద్యాల, నందికొట్కూరు ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, ఆర్థర్‌ అన్నారు. నంద్యాల క్రిస్టియన్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో జేఏసీ మొదటి వార్షికోత్సవం, గ్రాండ్‌ క్రిస్మస్‌ సభ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా నంద్యాల, నందికొట్కూరు ఎమ్మెల్యేలతోపాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల క్రిస్టియన్‌ జేఏసీ చైర్మన్‌ రాజు హాజరయ్యారు. ఈకార్యక్రమానికి జేఏసీ అధ్యక్షుడు మణిరాజు భాస్కర్‌ అధ్యక్షత వహించారు. 2022 నూతన క్యాలెండర్‌ను అతిథులు ఆవిష్కరించి క్రిస్మస్‌ కేక్‌ను కట్‌ చేశారు. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గంగిశెట్టి శ్రీధర్‌, నంద్యాల మండల జడ్పీటీసీ గోపవరం గోకుల కృష్ణారెడ్డి, జేఏసీ ప్రధాన కార్యదర్శి మన్నెం జానయ్య తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-12-05T05:43:48+05:30 IST