మాదిగ ఆవాసాల్లో బీజేపీని బహిష్కరిస్తాం
ABN , First Publish Date - 2022-07-01T06:45:39+05:30 IST
ఎస్సీ వర్గీకరణపై మాట తప్పిని బీజేపీకి మాదిగ బస్తీలు, గ్రామాల్లో బహిష్కరిస్తామని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర నాయకులు చిలుకమారి గణేష్ మాదిగ అన్నారు.
ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర నాయకుడు గణేష్ మాదిగ
భువనగిరి టౌన/చౌటుప్పల్, జూన 30: ఎస్సీ వర్గీకరణపై మాట తప్పిని బీజేపీకి మాదిగ బస్తీలు, గ్రామాల్లో బహిష్కరిస్తామని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర నాయకులు చిలుకమారి గణేష్ మాదిగ అన్నారు. గురువారం భువనగిరిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు హైదరాబాద్లో మూడు రోజుల పాటు జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వద్ద నిరసన తెలుపుతామన్నారు. సమావేశంలో నాయకులు బొడ్డు నర్సింగ్, ఎడ్ల మహేందర్, బర్రె చందు, భూషపాక కొండల్, విజయ్ పాల్గొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరుతామని ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ బోయ లింగస్వామి అన్నారు. చౌటుప్పల్ అంబేద్కర్ భవనలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో నాయకులు బోయ దేవేందర్, బోయ గణేష్, సుక్క అర్జున, పాల్గొన్నారు.