అంబేద్కర్‌ స్ఫూర్తితో అధికారంలోకి వస్తాం

ABN , First Publish Date - 2021-12-06T05:30:00+05:30 IST

అంబేద్కర్‌ స్ఫూర్తితో అధికారంలోకి వస్తాం

అంబేద్కర్‌ స్ఫూర్తితో అధికారంలోకి వస్తాం
అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పిస్తున్న ప్రవీణ్‌కుమార్‌

ఇబ్రహీంపట్నం: అంబే ద్కర్‌ స్ఫూర్తితో తెలంగాణలో బీఎస్పీని అధికారంలోకి తీసుకువస్తామని బీఎస్పీ రాష్ట్ర కోఆర్టినేటర్‌ డాక్టర్‌ ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా సోమవారం ఇబ్రహీంపట్నంలో ఆయన విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం ఇక్కడ పార్టీ ముఖ్య కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలు, సామాజిక రుగ్మతల నిర్మూలన కోసం అంబేద్కర్‌ నిరంతరం కృషిచేశారని ఆయన గుర్తుచేశారు. పేదలకు చెందిన అస్సైన్డ్‌ భూములను రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని అన్నారు. పేదవర్గాల పక్షాన బీఎస్పీ నిరంతరం పోరాడుతుందని అన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గ్యార జగన్‌, రాజు, రాములు, మల్లేష్‌, సురేష్‌ తదితరులున్నారు. 

Updated Date - 2021-12-06T05:30:00+05:30 IST