24 నెలల్లో వైద్యకళాశాల పూర్తి చేస్తాం

ABN , First Publish Date - 2021-04-23T05:19:12+05:30 IST

పులివెందుల వైద్యకళాశాల నిర్మాణం 24 నెలల్లో పూర్తి చేయనున్నామని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి ప్రతి ఒక్కరికి కార్పొరేట్‌ వైద్యం అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో పులివెందుల ప్రాంతంలో మెడికల్‌ కళాశాల తెచ్చారని అన్నారు.

24 నెలల్లో వైద్యకళాశాల పూర్తి చేస్తాం
మెడికల్‌ కళాశాల నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ఎంపీ అవినాష్‌రెడ్డి

భూమి పూజలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

పులివెందుల టౌన, ఏప్రిల్‌ 22: పులివెందుల వైద్యకళాశాల నిర్మాణం 24 నెలల్లో పూర్తి చేయనున్నామని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి ప్రతి ఒక్కరికి కార్పొరేట్‌ వైద్యం అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో పులివెందుల ప్రాంతంలో మెడికల్‌ కళాశాల తెచ్చారని అన్నారు. గురువారం 10గంటల ప్రాంతంలో పులివెందుల మెడికల్‌ కళాశాల నిర్మాణానికి సంబంధించి ఎంపీ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాకే తలమానికంగా ఉండేలా పులివెందుల మెడికల్‌ కళాశాల రూ.500 కోట్లతో రూపుదిద్దుకోబోతోందన్నారు. రాబోయే రెండు సంవత్సరాలలో విద్య, వైద్య, పరిశ్రమ రంగాలలో జిల్లా రూపురేఖలు మారుతాయన్నారు. అనంతరం లింగాల కుడికాల్వ పెండింగ్‌ పనులకు భూమి పూజ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.21కోట్ల మంజూరు చేయగా కాల్వలపై బ్రిడ్జిలు, వంకల వద్ద దారులు ఏర్పాటుచేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన వరప్రసాద్‌, వైస్‌చైర్మన వైఎస్‌ మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి, తహసీల్దార్‌ మాధవకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T05:19:12+05:30 IST