త్వరలో రెండో విడత గొర్రెలు పంపిణీ చేస్తాం
ABN , First Publish Date - 2022-07-06T06:28:45+05:30 IST
త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ చేయనున్నట్లు గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్ తెలిపారు. భువనగిరి మండలం బస్వాపురంలో తొలి విడత లబ్ధిదారులతో మంగళవారం నిర్వహించిన మాటా ముచ్చటలో ఆయన మాట్లాడారు.
గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్
భువనగిరిటౌన్, జూలై5: త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ చేయనున్నట్లు గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్ తెలిపారు. భువనగిరి మండలం బస్వాపురంలో తొలి విడత లబ్ధిదారులతో మంగళవారం నిర్వహించిన మాటా ముచ్చటలో ఆయన మాట్లాడారు. వృత్తిదారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. అందులో భాగం గా గొల్ల, కుర్మలకు గొర్రెలు పంపిణీచేశారన్నారు. ఈ పథకం కింద లబ్ధిపొందినవారు జీవాలను సాకి అభివృద్ధి పథంలో కొనసాగాలన్నారు. గ్రామంలో 21 గొర్రెల లబ్ధిదారుడైన వెంకటయ్యతో మాట్లాడి, ప్రభుత్వ సాయంతో పొందిన ఆర్థికవృద్ధిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పెద్దగొర్ల వెంకటే్షయాదవ్, మల్లేష్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.