మోదీకి ఊరూరా శవయాత్రలు చేస్తాం: తాడూరి శ్రీనివాస్
ABN , First Publish Date - 2022-02-10T22:39:59+05:30 IST
తెలంగాణ జోలికొస్తే ప్రధాని మోదీకి ఊరూరా శవయాత్రలు చేస్తామని
హైదరాబాద్: తెలంగాణ జోలికొస్తే ప్రధాని మోదీకి ఊరూరా శవయాత్రలు చేస్తామని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ హెచ్చరించారు. ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్లో మోదీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణపై పార్లమెంట్లో మోదీ విషయం చిమ్ముతూ మాట్లాడారని ఆయన ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ‘ఆంధ్రప్రదేశ్ విభజన’పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అత్యంత సిగ్గుచేటైన రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపించారు. పార్లమెంటులో మైకులు బంద్ చేసి, పెప్పర్ స్ర్పేలు కొట్టి విభజన బిల్లును ఆమోదించారని విమర్శించారు. తాము తెలంగాణాకు వ్యతిరేకం కాదన్నారు. తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా విభజించినప్పటికీ, ఆ పార్టీని ప్రజలు నమ్మలేదన్నారు.